+91 95819 05907

అశ్వారావుపేటలో గంజాయి కేసులో ఏడుగురు అరెస్ట్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే 09: నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అశ్వరావుపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి నాగరాజు రెడ్డి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం, అశ్వరావుపేటలోని బిసిఎం రోడ్డులో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకు వద్ద ఎస్సై టీ యయాతి రాజు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఊట్లపల్లి వైపు నుంచి మూడు బైకులుపై అశ్వరావుపేట వైపు వెళ్తున్న ఏడుగురు యువకులు అనుమానస్పదంగా కనిపించడంతో నిలిపి తనిఖీలు చేశారు. దీంతో వారి వద్ద 2.75 లక్షలు విలువైన 5.5 కేజీల గంజాయి లభ్యమైంది. మూడు బైకులు, 6 సెల్ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. విచారణ చేపట్టి నిందితులు అశ్వారా పేటకు చెందిన షేక్ ఫిరోజ్ ఖాన్, గండికోట ప్రభు కుమార్, పసుపు లేటి గోపి చంద్(శ్రీను), ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన పుట్టా జగదీష్, గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన తిరువీధుల కార్తీక్, హైద్రాబాద్ లోని చంపాపేట్ ప్రాంతానికి చెందిన బుల్లా సంజయ్ లను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారి రాము పరారిలో వున్నాడని సీఐ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్సై రామూర్తి, ట్రైనీ ఎస్సై అఖిల, సిబ్బంది నాగేంద్రరావు, హరిబాబు, కృష్ణ ప్రసాద్, పీ రమేష్ రావు, రామకృష్ణ, నరేష్ బాబు, ఎం బానుచందర్, ఎన్ వెంకటేశ్వరావు, బీ సంతోష్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !