+91 95819 05907

సిఎస్ఐ చర్చి స్టాఫ్ నర్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో నివాసం ఉంటున్న సరోజనమ్మ (87) స్టాప్ నర్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు సాయంత్రం మృతి చెందారు.ఆమె స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందినవారు ఆమె తల్లిదండ్రులు మెదక్ సిఎస్ఐ చర్చిలో మొదటగా పని చేశారు.ఆ తర్వాత ఆమె సిఎస్ఐ మిషన్ అస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తూ గత 40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో మిషన్ ఆసుపత్రుల్లో నిరుపేద ప్రజలకు అనేక వైద్య సేవలు అందించారు.ఆమె మిషన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా రిటైర్మెంట్ అయ్యి గత కొన్ని సంవత్సరాలుగా రామాయంపేట సీఎస్ఐ చర్చిలోనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.అందరితో కలుపుగోలుగా ఉండి అందరి హృదయాల్లో ఆమె స్థిరంగా నిలిచిపోయారు.అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి నెలకు ఒక గ్రామం దత్తత తీసుకొని రామాయంపేట నందిగామ,తూప్రాన్ పరిసర ప్రాంతాలలో వారు సొంత ఖర్చులతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసుకొని నిరుపేద ప్రజలకు వైద్య సేవలు కూడా అందించారు.ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడంతో మిషన్ కాంపౌండ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.రామాయంపేట సిఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం సంఘ నాయకులు పట్టణ ప్రజలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !