రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో నివాసం ఉంటున్న సరోజనమ్మ (87) స్టాప్ నర్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు సాయంత్రం మృతి చెందారు.ఆమె స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందినవారు ఆమె తల్లిదండ్రులు మెదక్ సిఎస్ఐ చర్చిలో మొదటగా పని చేశారు.ఆ తర్వాత ఆమె సిఎస్ఐ మిషన్ అస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తూ గత 40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో మిషన్ ఆసుపత్రుల్లో నిరుపేద ప్రజలకు అనేక వైద్య సేవలు అందించారు.ఆమె మిషన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా రిటైర్మెంట్ అయ్యి గత కొన్ని సంవత్సరాలుగా రామాయంపేట సీఎస్ఐ చర్చిలోనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.అందరితో కలుపుగోలుగా ఉండి అందరి హృదయాల్లో ఆమె స్థిరంగా నిలిచిపోయారు.అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి నెలకు ఒక గ్రామం దత్తత తీసుకొని రామాయంపేట నందిగామ,తూప్రాన్ పరిసర ప్రాంతాలలో వారు సొంత ఖర్చులతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసుకొని నిరుపేద ప్రజలకు వైద్య సేవలు కూడా అందించారు.ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడంతో మిషన్ కాంపౌండ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.రామాయంపేట సిఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం సంఘ నాయకులు పట్టణ ప్రజలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.









