రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది.గత గురువారం నుంచి శ్రీ పెద్దమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా అమ్మవారి కల్యాణం,ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమం,బోనాల ఊరేగింపు కార్యక్రమం ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా శనివారం జాతర ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంటుందని ముదిరాజ్ సంఘ నాయకులు తెలిపారు.ఈ జాతర ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామానికి చేరుకుని శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ శ్రీ పెద్దమ్మ ఆశీస్సులతో పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
