హైదరాబాద్, మే 9 : ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని ప్రకటించింది.
సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ మీదుగా ఉత్తరం వైపునకు వెళ్లి, జూలై 15 నాటికి దేశమంతా విస్తరిస్తాయని, అయితే, ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందుగానే జూన్ 1 నాటికి కేరళ తీరానికి, జూలై 11నాటికి దేశమంతా విస్తరించే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ అంచనా మేరకు మే 25 నాటికి రుతుపవనాలు కేరళ తీరానికి చేరుకుంటాయని అంచనా వేసింది.
Post Views: 19