నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న 10మంది పేకాటరాయులను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వాపురం మండలంలోని పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న పదిమంది పేకాటరాయలను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి 20వేల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో పోలీస్ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సిఐ జి అశోక్ మాట్లాడుతూ మండలంలో పేకాట కోడిపందాలు పశువుల అక్రమ రవాణా మొదలైన వాటిని సహించేది లేదని ఎవరైనా సమాచారం అందించినట్లయితే గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 8712682093 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు.
Post Views: 235