నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలు మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడులను తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లు కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో అమలు ఐదు సంవత్సరాలయింది. ఇప్పుడు వాటి అమలు చేసి కార్మికులకు పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నది. 2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. సామాజిక సంక్షేమాలకి కోతలు పెట్టింది. సామాన్యులపై బారాలు మోపి కార్పొరేట్ కొత్త సంస్థలకు పెట్టుబడుదారులకు వేల కోట్లు రైతులు ప్రకటించింది. ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోకపోవడం ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చి ఆర్థిక విధానాలను విచక్షణ రహితంగా అమలు చేస్తున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానము వెనక్కి నెట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు 2025 మే 25 చేయాలని నిర్ణయించాయి. ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిషన్ మోర్చా ఎస్ కే యం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో అఖిలపక్షంలో భాగమైన అశ్వరావుపేటలోని అన్ని పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని 20వ తారీకున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అందరూ ఏకమై పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన ఐదు శాతంగా ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70% ఆదాయం పోగుపడగా, 50 శాతం ప్రజల వద్ద కేవలం 3 శాతం మాత్రమే ఉండి రోజు గడవడమే కష్టంగా మారింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నారు. 12 గంటల పనిని చట్టబడటం చేస్తున్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తున్నారు. కావున అఖిలపక్ష పార్టీలు, సంఘటిత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు ఉద్యోగులందరూ ఏకమై ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వరావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సయ్యద్ సలీం, గన్నిన రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, కూన చిన్నారావు, సిపిఐ ఎంఎల్ నాయకులు గోకినపల్లి ప్రభాకర్, ఏఐటియుసి నాయకులు పటాన్ జలాల్, సిఐటియు నాయకులు పిట్టల అర్జున్, నరసింహారావు, సిపిఐ పట్టణ నాయకులు నూకవరపు విజయకాంత్, జోగిరాజు, జక్కం బలరాం, షేక్ సైదా, శ్రీను,కార్మిక సంఘాల నాయకులు రహమత్, మోర్తజ మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.









