నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామం లో గురువారం పంచాయతీ ప్రత్యేక అధికారి చందా భద్రయ్య, పంచాయితీ కార్యదర్శి కోరం రాజు ఆధ్వర్యంలో ఎంపీడీఓ బద్రునాయక్ అధ్యక్షతన రమణక్కపేట,గొల్లగూడెం ఇసుక రీచ్ లకు పిసా గ్రామసభ నిర్వహించారు. గ్రామం మొత్తం 106 గిరిజన ఓటర్లు ఉండగా పిసా గ్రామ సభకు 88 మంది గిరిజన ఓటర్లు హాజరై రమణక్కపేట,గొల్లగూడెం ఇసుక రీచ్ ల నిర్వహణ బాధ్యతలను రిజిస్టర్ సోసైటీ అయిన కొమరం భీమ్ ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ కు అప్పగించెందుకు చేతులు ఎత్తి వారి యొక్క మద్దతును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.ఈ పిసా గ్రామ సభలో పిసా మొబిలైజర్ పోలేబోయిన యస్వంత్,పిసా కార్యదర్శి గొంది ప్రసాద్, పిసా ఉపాధ్యక్షులు సముద్రాపు నాగరాజు,పిసా కమిటీ సభ్యులు , సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 310









