సమసమాజ మార్గదర్శకుడు మారోజు వీరన్న
_ భూక్య ఉపేంద్ర బాయి
ఖమ్మం మే 16 : తన నూతన ఆలోచనల మేరకు భారతదేశం లో సమ సమాజం కోసం మార్గదర్శకత్వం వహించిన అమరుడు మారోజు వీరన్న అని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి కొనియాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం లో మారోజు వీరన్న 26వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మారోజు వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మారోజు వీరన్న కారణంగానే విప్లవోద్యమాలలో నూతన వరవడి, లాల్ నీల్ స్నేహ సంబంధాలలో మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మారోజు వీరన్న సతీమణి చైతన్య , కుమార్తె దిశా , సృజన ,సామాజిక కార్యకర్త లలిత వీర చారి , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , వీర నారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు కే. విజయ , జిల్లా అధికార ప్రతినిధి త్రివేణి , గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి , కార్యదర్శి ప్రమీల , జాయింట్ సెక్రటరీ సరోజిని , సలహాదారులు వీరన్న నాయక్ , రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.









