రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం నాడు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని మరియు మహాదేవ ఇండ్రస్ట్రీస్ రైస్ మిల్లును మెదక్ ఆర్డీవో రమాదేవి సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పిఎసిఎస్ కేంద్రాలలో అధికారులు వేగవంతం చేయాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీలలో కాంట్రాక్టర్లు మిల్లులకు త్వరగా చేరవేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా రైస్ మిల్లు యాజమానులు దాన్యం రైస్ మిల్లులకు వచ్చిన ఆరు గంటల లోపు అన్ లోడింగ్ చేసుకోవాలని తెలిపారు.మిల్లులలో ధాన్యాన్ని తడవకుండా టార్పాన్లను కప్పి ధాన్యం నిల్వలను భద్రపరచాలని తెలిపారు.ధాన్యం నిల్వల రికార్డులను సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.అకాల వర్షాల కారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు తాము కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలియపరచారు.ఆమె వెంట మండల తహసిల్దార్ రజనీకుమారి ఆర్ఐ గోపి తదితరులు ఉన్నారు.









