మాసాయిపేట నూతన మండల అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 18.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని బీజేపీ పార్టీ, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన,మాసాయిపేట మండల నూతనఅధ్యక్షుడుగా ఎన్నికయిన, మోలుగు నాగేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మాసాయిపేట మండలంలో, బిజెపిపార్టీ బలోపేతం చేస్తామని, మరియు రానున్న స్థానిక ఎలక్షన్ లో, భారతీయ జనతా పార్టీ వీలైనంత ఎక్కువ సీట్లు గెలిపించుకుంటామని, మరియు కార్యకర్తల అందోళన చెందకుండా, ఉండాలి అని మాసాయిపేట మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి తెలిపారు. మరియు 5 సంవత్సరాలు బిజెపి పార్టీకి సేవలు చేసిన,మాజీ అధ్యక్షుడు పాపన్నగారి వేణుగోపాల్ ని, పార్టీ ముఖ్య నాయకులు మరియు బూత్ అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు బూత్ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిలు, ఓబీసీ మోర్చా నాయకులు, మరియు ఎస్సీ మోర్చా నాయకులు, మరియు ఎస్టి మోర్చా, బీజేవైఎం మోర్చా నాయకులు పాల్గొన్నారు.









