సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, (వైరాప్రతి నిధి) కొణిజర్ల:
కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ రథసారథి వర్గ పోరాటాలను నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ స్ఫూర్తితో వర్గ పోరాటాలను నిర్వహించడం ద్వారానే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్లు అవుతామని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ మండల పరిధిలో సీతారాంపురం, రెడ్డిగూడెంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సుందరయ్య జ్ఞాపకార్థంగా నిర్మించిన స్థూపాలు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలయసి ఘనంగా నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు, నేడు దేశంలో రోజురోజుకు పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుందని దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారధక్తంగా కారు చౌకగా అమ్మేస్తున్నాయి విమర్శించారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టుల నాయకత్వన పోరాడి కమ్యూనిస్టు పార్టీల బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రజల్లో ఉండి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరియు సాగునీటి కొరకు పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు, ఇల్లు లేని పేదలకు ఇల్లు, భూ సమస్యపై సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని చేస్తామని ఆయన అన్నారు, కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సిపిఎం కొనిజర్ల మండల కార్యదర్శి, చెరుకుపల్లి కుటుంబరావు మండల నాయకులు, శాఖ కార్యదర్శి, ఉప్పర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు,









