బూర్గంపాడు
మండలం కమిటీ ఆధ్వర్యంలో
సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సుందరయ్య
మీ ఆశయాలను సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తూ సుందరయ్య ఫోటోకు పూలదండ ఏసి జోహార్లు అర్పించిన,
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ సుందరయ్య గారి గురించి ఎంత చెప్పిన తీరని లోటు అని అన్నారు,
సొంత గ్రామంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు భూమి లేని పేదలకు భూమిని పంచాలి కూలీ రేట్లు పెంచాల అని పట్టుపట్టాడు,
రేట్లు పెంచితే తర్వాత భూమిని పంచాలని వారు డిమాండ్ చేస్తారని వాదన భూస్వాముల నుంచి వచ్చింది, కానీ ఆయన కూలి పెంపు పోరాటం చేసి ఆ తర్వాత భూమి పంపిణీ కోసం కూడా తిరుగుబాటు చేశాడు, సమానత్వం కోసం జరిగిన ఈ పోరాటంలో ఆయన దళితులతో నూ. వెనకబడిన కులాలతో కలిసి నిలబడ్డాడు అప్పుడే
కులానికి చిహ్నమైన పేరుతో తన పేరులో సుందర రామ్ రెడ్డి అనే పేరును తొలగించుకొని సుందరయ్యగా మారాడు జాతీయో ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణలో 1946 నుంచి 51 వరకు జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సుందరయ్య నాయకత్వం వహించాడు,
రజాకార్ల అమానషం భూస్వాముల ఆకృత్యాలు వేధింపులు విసిగిపోయిన పల్లె ప్రజలు కమ్యూనిస్టులతో
కలిసి కదం తొక్కడం లో రజాకార్లు భూస్వాములు పెత్తందార్లు పైన ఉద్యమం కొనసాగించారు,
అలాంటి త్యాగమూర్తి సుందరయ్య గారికి మనం ఆయన బాటలోనే నడవాలని ఆయన ఆశయాన్ని ముందుకు,
తీసుకు పోవాలని కొనియాడారు
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు భయ్యా రాము, బత్తుల గోపాలరావు ,మురళి, వీరన్న ,హనుమంతు ,శ్రీనివాసు , ప్రదీప్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు









