*శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి*
హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మే 19.
మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలోని బాచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మండల నాయకులతో కలసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. సకల శుభాలు కలగాలని, మెదక్ జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో పాపంపేట మండలం మాజీ ఎంపీపీ సొంగ.పవిత్ర దుర్గయ్య, మెదక్ జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు సోములు, పాపన్నపేట మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు గాడిల.శ్రీనివాస్ రెడ్డి,ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ లు బాలా గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు వెంకట్ రాములు,గురుమూర్తి గౌడ్,లింగ రెడ్డి,ఆశయ్య, నాయకులు సాయి రెడ్డి, బాబా గౌడ్, దుర్గయ్య, వెంకటేశం,రాము గుప్తా, కృష్ణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









