ట్విట్టర్, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా సత్వరమే పరిష్కరించాలి.
ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని, నిబంధనల ప్రకారం మనం ఏదైనా దరఖాస్తు పరిష్కారం చేయలేని సమయంలో కారణాలు తెలియజేస్తూ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అన్నారు. ప్రజావాణి దరఖాస్తులను జిల్లా అధికారులు పక్కాగా ట్రాక్ చేయాలని, మండలాల పరిధి నుంచి వచ్చే సమాధానాలు ఎలా ఉంటున్నాయో క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. ప్రతి సోమవారం నాడు ప్రజావాణి తర్వాత వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వేంసూర్ మండలం బీరపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుందని, వాటిని వెంటనే నిలిపివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వేంసూరు మండలం తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకొని రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









