దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసులో రేపోని గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మిడతపల్లి మంగమ్మ ఫిర్యాదు చేయగా, వీరారం గ్రామానికి చెందిన గుండె అజిత్ను నిందితుడిగా నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు సమగ్రంగా పరిశీలించిన అనంతరం నిందితుడు నేరం చేసినట్లు రుజువుకావడంతో, సీఆర్పీసీ సెక్షన్ 235(2) ప్రకారం జీవిత ఖైదుతో పాటు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.30,000 జరిమానా విధించడం జరిగింది.
ఈ కేసును ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఎం.డి. అబ్దుల్ రఫీ విచారించగా, ప్రాసిక్యూషన్ను ఇన్చార్జ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కొంపల్లి వెంకటయ్య నడిపించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్. జీనత్, ఎస్ఐ, డీసీఆర్బీ విధులు నిర్వహించగా, కేసు బ్రీఫింగ్ను పి. రాజు, ఎస్ఐ, దంతాలపల్లి మరియు టి. గణేష్, సీఐ, తొర్రూరు సర్కిల్ నిర్వహించారు.
కేసు దర్యాప్తును మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వై. నందీప్, అప్పటి ఎస్ఐ, దంతాలపల్లి చేపట్టగా, అనంతరం విచారణను వి. చెరాలు, అప్పటి సీఐ, తొర్రూరు సర్కిల్ పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు డ్యూటీని బి. మంగిలాల్, దంతాలపల్లి పోలీస్ స్టేషన్ నిర్వర్తించారు.









