నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు. మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ పునుకొల్లు నీరజ లతో కలిసి స్టేడియంలో నూతనంగా నిర్మించిన టేబుల్ టెన్నిస్ హాల్ ను సందర్శించి, సమకూర్చిన క్రీడా సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసుతున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
Post Views: 99








