నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 24: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు తాటి రవికుమార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి దయతో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
Post Views: 25








