ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర
కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ వారిచే ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు రేపల్లెవాడ గ్రామం చింతకాని క్లస్టర్ చింతకాని మండలం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏడిఏ S. విజయ్ చంద్ర (మధిర) మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూమి జీవశక్తి పెరుగుతుందని నీటి నిలువలు,మట్టి నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు,ఆరోగ్యవంతమైన ఆహారం లభిస్తుందని పంటకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయానికి జీవ ఎరువులు ,వర్మీ కంపోస్ట్, గోమూత్రం , పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, ద్రవ జీవామృతం, దశపర్ణిక అస్త్రం, నీమస్త్రం, అగ్ని అస్త్రం ఆధారిత శీఘ్రకరకాలు వాడాలని సూచించినారు చెప్పినారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, కృషి వికాస్ కేంద్రం వైరా నుంచి శాస్త్రవేత్త ఫణిశ్రీ , గ్రామ సర్పంచ్ మడిపల్లి అంబిక , ఉప సర్పంచ్ బంధం చిన కృష్ణ ,AEO తేజ, గ్రామ కార్యదర్శి రామారావు మరియు రైతు సోదరులు బొర్రా శ్రీనివాస రావు, మడిపల్లి శ్రీనివాస రావు,బండి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.








