+91 95819 05907

నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి ◆మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి

*హైదరాబాద్*

*మునుగోడులో నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి*
*ప్రీజ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలి*
*మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి*
*హైదరాబాద్* , :తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని తక్షణమే అమలు చేసి, ప్రీజ్‌లో ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను వెంటనే అన్‌ఫ్రీజ్ చేయాలని *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం* ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు వారు *తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని* హైదరాబాద్‌లో కలసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో యాదవ, కురుమ (గొల్ల) వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం, వారి సాంప్రదాయ వృత్తులకు మద్దతు అందించేందుకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల జీవితాల్లో సామాజిక, ఆర్థిక పరిపుష్టి సాధించడమే ఈ పథక లక్ష్యమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 20 గొర్రెలు + 1 పొట్టేలు (మొత్తం 21) కలిగిన యూనిట్‌ను 75 శాతం సబ్సిడీతో అందించేందుకు నిర్ణయించారని తెలిపారు. ప్రతి యూనిట్‌కు లబ్ధిదారులు బ్యాంకుల్లో రూ.45,000 డిపాజిట్ చేసినట్లు చెప్పారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను ప్రీజ్‌ చేయగా, ఇప్పటికీ వాటిని అన్‌ఫ్రీజ్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఖాతాలు ప్రీజ్‌లో ఉండటంతో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయి, వ్యవసాయ కార్యకలాపాలు, పత్తి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బులు కూడా వినియోగించుకోలేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన లబ్ధిదారుల ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసి, గొర్రెల పంపిణీ పథకాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పథకం అమలులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, జగన్ యాదవ్, సురేష్ యాదవ్, అయోధ్య యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, మంగ వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి ◆మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి

*హైదరాబాద్* *మునుగోడులో నిలిచిపోయిన గొర్రెల పథకం వెంటనే అమలు చేయాలి* *ప్రీజ్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలి* *మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ నెల్లికంటి* *హైదరాబాద్* , :తెలంగాణ

Read More »

పాలకుర్తి అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు

Read More »

హిందూ మతం ఎప్పుడు పుట్టింది*

* ? వ్యాసకర్త కె.ఎల్‌.కాంతారావు. నేటి గద్దర్ స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో మనమంతా హిందువులం, మనమంతా బంధువులం” అని ఇటీవల కొందరు అదేపనిగా నినాదాలిస్తున్నారు. అసలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు అనే భావన

Read More »

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులకు ఆత్మ సౌజన్యంతో సహచర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ

Read More »

DVCM కమాండర్ మల్లేష్ AK-47 తో లొంగిపోయాడు

కాంకేర్‌లో భారీ లొంగుబాటు: DVCM మావోయిస్టు మల్లేష్ AK-47తో లొంగిపోయాడు కాంకేర్. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో శాంతిని నెలకొల్పే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో, మావోయిస్టు సంస్థకు చెందిన DVCM (డివిజనల్ కమిటీ సభ్యుడు)

Read More »

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి :సీపీఎం

— *సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్, వైరా : కురిసిన అకాల వర్షం, వైరా నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం మరియు ఈదురు గాలుల కారణంగా

Read More »

 Don't Miss this News !