+91 95819 05907

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి :మంత్రి Dr సీతక్క

– ములుగు నియోజక వర్గ అభివృద్ధి నా బాధ్యత బలరాం నాయక్ గారిని గెలిపించే బాధ్యత మీది

– బిల్ట్ ఫ్యాక్టరి తెరిపించి మంగపేట మండలాన్ని అభివృద్ధి చేసి తీరుతాం

– ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం

– మీరు ఆశీర్వదిస్తే మంత్రిని అయిన ములుగు నియోజక వర్గం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా

– కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండు కావాలని బిజెపి చూస్తుంది

– మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి.

– 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 2లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

– బిజెపి,బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మద్దు మోసపోవద్దు

– ప్రభుత్వ సంస్థలను అమ్మే బిజెపి కావాలా…. దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలి.

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
నేటి గద్ధర్ న్యూస్,ములుగు
మంగపేట మండలం లోని బ్రహ్మణ పల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరు నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుంది అని మళ్ళీ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడం తో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు భూములు పంచినం ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చినాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పేదల పక్షాన నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది బిజెపి
బిఆర్ఎస్ లు 10 యేండ్లు పాలించి ఏ ఒక్క పేదవాడికి న్యాయం చెయ్యలేదని నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకచ్చిన వాటికి మద్దతు తెలిపింది
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచించండి
కెసిఆర్ 10 యేండ్ల లో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ లక్షల కోట్లు అప్పు చేశాడు అని
ప్రభుత్వ రంగ సంస్థలు నీ తన స్వలాభం కోసం ఆయన మిత్రులకు కట్టబెట్టి పేదల నడ్డి విరిచారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు కొవాలని బిజెపి చూస్తుందని ప్రజలందరూ బిజెపి ఎత్తుగడలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు
మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం
మీరు బలరాం నాయక్ గారికి తోడుగా నిలవండి…. నేను మీకు అండగా ఉంటాను…
యువకుల బలిదానాలు చూసి సోనియామ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చెశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
10ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, ఆక్రమాలు తప్ప ఏమి లేదు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో 5న్యాయలతో ప్రజలకు న్యాయం జరుగుతుంది
అసెంబ్లీ ఎన్నికలలో 6గ్యారంటీలు ఇచ్చాము
ఇప్పటికే 5గ్యారంటీలను అమలు చేశాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మన ప్రాంత బిడ్డ గతములో కేంద్ర మంత్రి గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మంత్రి సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్

Read More »

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు బాధితుడి ఫిర్యాదు

Read More »

అశ్వరావుపేటలో మట్టి మాఫియా ‘గ్రావెల్’ దందా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

​అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా! నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) ​మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా

Read More »

 Don't Miss this News !