+91 95819 05907

మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి :మంత్రి Dr సీతక్క

– ములుగు నియోజక వర్గ అభివృద్ధి నా బాధ్యత బలరాం నాయక్ గారిని గెలిపించే బాధ్యత మీది

– బిల్ట్ ఫ్యాక్టరి తెరిపించి మంగపేట మండలాన్ని అభివృద్ధి చేసి తీరుతాం

– ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం

– మీరు ఆశీర్వదిస్తే మంత్రిని అయిన ములుగు నియోజక వర్గం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా

– కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండు కావాలని బిజెపి చూస్తుంది

– మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలి.

– 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 2లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

– బిజెపి,బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మద్దు మోసపోవద్దు

– ప్రభుత్వ సంస్థలను అమ్మే బిజెపి కావాలా…. దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలి.

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
నేటి గద్ధర్ న్యూస్,ములుగు
మంగపేట మండలం లోని బ్రహ్మణ పల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరు నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఏడాదికి 42 రోజులె పని కల్పిస్తుంది అని మళ్ళీ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 100 రోజులు పని కల్పించడం తో పాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు భూములు పంచినం ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చినాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పేదల పక్షాన నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది బిజెపి
బిఆర్ఎస్ లు 10 యేండ్లు పాలించి ఏ ఒక్క పేదవాడికి న్యాయం చెయ్యలేదని నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకచ్చిన వాటికి మద్దతు తెలిపింది
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచించండి
కెసిఆర్ 10 యేండ్ల లో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ లక్షల కోట్లు అప్పు చేశాడు అని
ప్రభుత్వ రంగ సంస్థలు నీ తన స్వలాభం కోసం ఆయన మిత్రులకు కట్టబెట్టి పేదల నడ్డి విరిచారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు కొవాలని బిజెపి చూస్తుందని ప్రజలందరూ బిజెపి ఎత్తుగడలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు
మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం
మీరు బలరాం నాయక్ గారికి తోడుగా నిలవండి…. నేను మీకు అండగా ఉంటాను…
యువకుల బలిదానాలు చూసి సోనియామ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.కానీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ దుర్మార్గపు పాలనతో సర్వనాశనం చెశారు.
కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
10ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, ఆక్రమాలు తప్ప ఏమి లేదు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో 5న్యాయలతో ప్రజలకు న్యాయం జరుగుతుంది
అసెంబ్లీ ఎన్నికలలో 6గ్యారంటీలు ఇచ్చాము
ఇప్పటికే 5గ్యారంటీలను అమలు చేశాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని మన ప్రాంత బిడ్డ గతములో కేంద్ర మంత్రి గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మంత్రి సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !