+91 95819 05907

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు.వెలుగుమట్ల భూదాన్ భూములకు చెందిన సిరికొండ కళ్యాణి తన ఇల్లు కూల్చేశారని, తనకు ప్రభుత్వం తరఫున అందించే సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఈ విభాగం అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం అర్బన్ మండలంలో సారధి నగర్ కు చెందిన గాలి నాగేశ్వరమ్మ తాము గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ఇంటిని రోడ్డు విస్తరణలో తొలగించాలని చూస్తున్నారని, తమకు ఆర్థిక సహాయం చేసి, మరోచోట ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఈ విభాగం అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామ సర్పంచ్ కొండూరి పరిశుద్ధ రావు గ్రామంలో రైతులు పండించిన మొక్కజొన్న మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరపై కొనుగోలు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మార్క్ ఫెడ్ అధికారికి రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
ఖమ్మం పట్టణానికి చెందిన దళిత వర్గీయులు గత ప్రభుత్వంలో 320 మంది లబ్ధిదారులకు దళిత బంధు నిధులు మంజూరి అయి ఉన్నాయని, వాటిని తమకు మంజూరు చేసి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈడి ఎస్సీ కార్పొరేషన్ కు రాస్తు పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని అన్నారు. ‌ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్

Read More »

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు బాధితుడి ఫిర్యాదు

Read More »

అశ్వరావుపేటలో మట్టి మాఫియా ‘గ్రావెల్’ దందా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

​అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా! నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) ​మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా

Read More »

 Don't Miss this News !