దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటనా
నేటి గదర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 08: అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం జరిగిన పలు శుభకార్యాల్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొని సందడి చేశారు. మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో గుల్లా రాంబాబు-రామదేవి దంపతుల కుమార్తె చి॥ రామహర్షిణి ఓణీల వేడుకకు హాజరైన ఆయన, చిన్నారిని దీవించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుంకిపాక వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శివశంకర్-భవానీలను ఆశీర్వదించారు. అదేవిధంగా చలమప్పగూడెం గ్రామంలో జరిగిన గుండి వారి వివాహ మహోత్సవానికి విచ్చేసి, కొత్త జంట సురేష్-హరితలకు పెళ్లి కానుకలు అందజేసి మంగళాశాసనాలు అందజేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, నాయకులు గాజుబోయిన ఏసుబాబు, పాకనాటి శ్రీను, రావుల శ్రీనివాసరావు, సి.కె. నాగార్జున, కాసిని వెంకటేశ్వరావు, సుంకిపాక ధర్మ, చిన్నంశెట్టి మధుబాబు, గుండి సూర్యం తదితర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









