+91 95819 05907

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల జాబితాకు కేంద్రం ఆమోదం..

అతి పెద్ద అంతర్జాతీయ క్రీడా సంరంభం ఒలింపిక్స్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రీడా మహోత్సవానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యమిస్తోంది. పారిస్ ఒలింపిక్స్-2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

 

కాగా, పారిస్ ఒలింపిక్స్ కు భారత్ భారీ బృందాన్ని పంపుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. తాజాగా, ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల జాబితాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

అయితే ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన మహిళా షాట్ పుటర్ అబా కథువా పేరును ఈ జాబితా నుంచి తొలగించారు. కేంద్రం ఆమోదించిన జాబితాలో ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

కాగా, భారత అథ్లెట్లతో పాటు 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్ వెళ్లనుంది. ఈసారి అందరి దృష్టి భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉండనుంది. చోప్రా 2021 ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో అంశంలో స్వర్ణం చేజిక్కించుకుని చరిత్ర సృష్టించడం తెలిసిందే.

 

ఇటీవల కొంతకాలంగా ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణిస్తుండడంతో… పారిస్ ఒలింపిక్స్ లో ఆయా క్రీడాంశాల్లో పతకాలపై ఆశలు కలుగుతున్నాయి. ప్రధానంగా భారత్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో పతకాలను ఆశిస్తోంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !