+91 95819 05907

పంజా విసురుతున్న విష జ్వరాలు…

నేటి గద్దర్ న్యూస్ స్టేట్ బ్యూరో జులై 18:
నైనారపు నాగేశ్వరరావు✍️

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి.మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సైతం హెచ్చరిస్తోంది. వర్షం,వాతావరణంలో మార్పుతో సీజనల్​ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో ప్రజలు విల విల లాడుతున్నారు.ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా సీజనల్​ వ్యాధులతో సతమతమవుతున్నారు.ఏటా వర్షాకాలం ప్రారంభవుతుందంటే ఆస్పత్రులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు క్యూ కడుతుంటారు.ఇక ఈ సారి జలుబు,దగ్గు, వైరల్ ఫీవర్లతో పాటు డెంగీ,మలేరియాలు పంజా విసురుతున్నాయి.వర్షంతో పాటే వ్యాధులు ముసురుతున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం,ఆదిలాబాద్ జిల్లాల్లోని అశ్వరావుపేట నుండి అదిలాబాద్ వరకు అటవీ ప్రాంతాల ప్రజలపై సీజనల్ వ్యాధులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.డెంగ్యూ తో పాటు ఈసారి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.ఇక జీహెచ్ఎంసీ వ్యాప్తి అంతకంతకూ తీవ్రమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,084 మంది డెంగీ బారినపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక వీరిలో ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే 382 మంది ఉండగా ఇతర జిల్లాలకు చెందిన వారు 506 మంది ఉన్నారు. మరో 196 మంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. దీంతో వారు ఏ జిల్లాలో డెంగీ బారినపడినా ఇతర రాష్ట్రాల వారిగా డేటా నమోదు చేస్తున్న పరిస్థితి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెంగీ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అధికంగా సీజనల్​ ఫీవర్​ బాధితులు
జీహెచ్​ఎంసీ పరిధిలో డెంగీతోపాటు సీజనల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. డయోరియా,ఫీవర్లు,రెస్పిరేటరీ సమస్యలతో నగరవాసులు ఊపిరి తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి.అక్యూట్ రెస్పిరేటరీ ఇన్​ఫెక్షన్​లు,ఇన్ ఫ్లుయెంజా కేసులు ఈ సారి మరింత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి.దాదాపు 20వేల మంది ఈసారి ఈ తరహా సమస్య బారిన పడటం ఆందోళన కలిగిస్తున్న అంశం.ఒక్క జులైలోనే 1,200 మందికి పైగా ఈ సమస్య బారినపడ్డారు. ఇక ఈ ఏడాది సీజనల్ ఫీవర్ బాధితులు అధికంగా ఉన్నారు.14వేలకు పైగా ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో సీజనల్ ఫీవర్లకు గురికావటం గమనార్హం.ఈ నెలలో ఇప్పటివరకు 1,043 మంది సీజనల్ ఫీవర్ బాధితులు ఉన్నారు.ఇక జనవరి నుంచి ఇప్పటి వరకు 7,783 డయోరియా కేసులు వెలుగు చూశాయి.తీవ్రమైన జ్వరం, జలుబు,దగ్గుతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది.ఈ నేపథ్యంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తీవ్రమైన జ్వరం, తలనొప్పి,దగ్గు వంటివి తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !