+91 95819 05907

రైతన్నల రుణమాఫీ సంబరాల్లో పాల్గొననున్న ఎంపీలు రఘురాం రెడ్డి, రేణుకాచౌదరి

మధ్యాహ్నం 2గంటలకు పాలేరు నుంచి కూసుమంచి వరకు ట్రాక్టర్ ర్యాలీ..

నేటి గదర్ న్యూస్ , జులై 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ రూ.లక్ష రుణమాఫీని ఆచరిస్తున్న సందర్భాన్ని హర్షిస్తూ గురువారం పాలేరు నియోజకవర్గవ్యాప్తంగా సంబరాలు జరపనున్నారు. ఇందులో భాగంగా కూసుమంచి మండలంలో జరిగే కర్షకుల పండుగకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు పాలేరు నుంచి కూసుమంచి వరకు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ దశాబ్ద కాలంలో రైతులకు లభించిన అతిపెద్ద ఊరటను పురస్కరించుకుని..ప్రదర్శనగా ముందుకు సాగనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు కూసుమంచిలోని రైతు వేదిక వద్ద లబ్ధిదారులు, రైతులతో పాల్గొననున్నారు. మండలంలోని రుణమాఫీ లబ్ధిదారులు, రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !