మధ్యాహ్నం 2గంటలకు పాలేరు నుంచి కూసుమంచి వరకు ట్రాక్టర్ ర్యాలీ..
నేటి గదర్ న్యూస్ , జులై 18 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ రూ.లక్ష రుణమాఫీని ఆచరిస్తున్న సందర్భాన్ని హర్షిస్తూ గురువారం పాలేరు నియోజకవర్గవ్యాప్తంగా సంబరాలు జరపనున్నారు. ఇందులో భాగంగా కూసుమంచి మండలంలో జరిగే కర్షకుల పండుగకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు పాలేరు నుంచి కూసుమంచి వరకు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ దశాబ్ద కాలంలో రైతులకు లభించిన అతిపెద్ద ఊరటను పురస్కరించుకుని..ప్రదర్శనగా ముందుకు సాగనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు కూసుమంచిలోని రైతు వేదిక వద్ద లబ్ధిదారులు, రైతులతో పాల్గొననున్నారు. మండలంలోని రుణమాఫీ లబ్ధిదారులు, రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.









