రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మార్త మాట్లాడుతూ 3 నుండి 5 సంవత్సరాలలోపు బడిడు పిల్లలందరిని అంగన్వాడిలో చేర్పించే విధంగా తాము గ్రామంలో ఇంటింటికి తిరిగి బడిడు పిల్లలను తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.ఈ విన్నుత కార్యక్రమం ద్వారా ఈనెల 15 నుండి 20 వరకు గ్రామంలో పిల్లలను తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు.అంగన్వాడి బడిబాట కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లలను బడికి పంపించే విధంగా కృషి చేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో గోల్పర్తి అంగన్వాడీ టీచర్ మార్త, అంగన్వాడి హెల్పర్ యాదమ్మ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.









