– బాణసంచాలతో కాల్చి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
– రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
– హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి
– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యములో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు చిత్ర పటానికి పాలాభిషేకం
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 18:
ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యములో రైతు రుణమాఫీ నీ హర్శిస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించి ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి వర్యులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా పైడాకుల అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.తెలంగాణలో ముఖ్యమైన జల ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హాయంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు. అందులో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దఫాలో చేయడంతో రైతులంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ తో పాటు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









