నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన రాజ్యసభ సభ్యురాలు యం పి రేణుకా చౌదరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన రాష్ట్రంలోని ప్రతీ రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే,ఇచ్చిన హామీని నెరవేర్చిన పార్టీ కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని ఆమె అన్నారు. మొదటి విడతగా నేడు 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు తీర్చుతున్నారు. ఆగష్టు నెల చివరిలోగా మిగిలిన 2 లక్షలు రుణమాపి పూర్తి చేస్తామ్మన్నారు. యం పి రఘు రం రెడ్డి మాట్లాడుతూ… రైతు కళ్ళలో ఆనందాలు చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు సంబరాలు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.









