+91 95819 05907

వరద బాధితులకు ఎక్కడికక్కడ వరద సహాయక చర్యలు: కలెక్టర్

నేటి గద్దర్ చింతూరు న్యూస్:

చింతూరు, కూనవరం ,జులై 28:- వరద బాధితులకు ఎక్కడికక్కడ వరద సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ బి ఎ యస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం చింతూరు, కూనవరం మండలాల్లోని వరద బాధితులకు వరద సహాయక కార్యక్రమాలు అందినది లేనిది జిల్లా కలెక్టర్ చింతూరు మండలంలోని గొల్ల గుప్ప, వీరపురం, కూనవరం మండలంలోని భద్రాయ గూడెం, తాళ్లగూడెం గ్రామాలలోని జిల్లా కలెక్టర్ నాటు పడవ పై ప్రయాణించి వరద బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరద ప్రాంతాలలోని వరద బాధితులకు ఎక్కడికక్కడ బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు, టార్పాల్స్ , టార్చ్ లైట్లు తదితర సరుకులు వరద బాధితులకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. చింతూరు, కూనవరం, వి ఆర్ పురం, ఏటపాక మండలాల్లోని వరద బాధితులకు వరద సహాయక కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు ఎక్కడికక్కడ అధికారులు నియమించడం జరిగిందని అదేవిధంగా ఎక్కడికక్కడ పడవలు, ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ రెండు మండలాల గ్రామాలలోని ఈరోజు వరద బాధితులతో వరద సహాయక కార్యక్రమాలు అందరికీ అందినది లేనిది అదేవిధంగా వారి సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులు ఈ వరదలకు నిర్మించుకున్న తాత్కాలిక గృహాల వద్దకు వెళ్లి ఎలా ఉంటున్నది అదే విధంగా వారి ఆరోగ్య పరిస్థితులను ఆయన ఆరా తీశారు. వరద బాధితుల గ్రామాలలో ఎక్కడికక్కడ పారిశుధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా వరద బాధితులకు అంటువ్యాధులు ప్రబలకుండా ఎక్కడికి అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వరద బాధితులకు ఏమైనా సమస్యలు ఉన్నాయెడల కంట్రోల్ రూమ్ లో తెలియపరచాలని ఆయన తెలిపారు. ఎక్కడికి అక్కడ వరద సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట కూనవరం వరదల ప్రత్యేక అధికారి సూరజ్ గానోరే, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య, తాసిల్దార్ నజీముల్లా, ఎంపీడీవో ఎ. లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !