+91 95819 05907

రామాయంపేటలో గ్రామపంచాయతీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ లను చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచులు మాట్లాడుతూ 2019-2024 సంబంధించిన సర్పంచులము గత ఐదు సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు.నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న గ్రామాల్లో పని చేసిన దానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు అసలు ఇవ్వలేదన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్న తమకు అప్పులు కుప్పలు చేసి తాము గ్రామాలు అభివృద్ధి పరుచుకొని ముందుకు వెళ్తున్నాం అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ సర్పంచులు 12,769 మంది ఉన్నారని మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కొడ్ కు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో సర్పంచులు చేసినటువంటి పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలు బయలుదేరుతున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని వారు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచులు ఉమామహేష్ స్వామి సుభాష్ నర్సాగౌడ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !