+91 95819 05907

గులాబీ డైరీ ఓపెన్ చేశా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

. పార్టీ కార్యాలయ ప్రారంబానికే అశేష జనం

. గులాబి పుస్తకంలో ప్రతీ ఒక్కరి పేరూ ఉంటుంది

. రేగా రాజ్యాంగం తప్పక అమలవుతుంది.

పినపాక,

పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యాలయంలో రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాక్షలు తెలిపారు.వచ్చే నాలుగు సంవత్సరాలు గతంలో కంటే ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తనతో పాటు మండల నాయకులు కూడా కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.సంవత్సర కాలంలోనే మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక ముద్రను మూటకట్టుకుందన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు నేడు నెత్తి,నోరు కొట్టుకుంటున్నారన్నారు. తప్పకుండా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆర్ అని జోస్యం చెప్పారు. ఎవరైతే చిల్లర రాజకీయాలు చేసి కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేసి,పార్టీని బదనాం చేస్తున్నారో వారిని గులాబి పుస్తకంలో ఎక్కించనున్నట్లు తెలిపారు. గులాబి పుస్తకంలో మొదటగా పినపాక మండలం నుండే పేర్లు నమోదు కానున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలుగాని హామీలతో, ఆచరణ సాధ్యం గాని పథకాలతో, తుపాకి రాముని మాటలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ గా కాంగ్రెస్ నిలుస్తుందన్నారు. సంక్రాంతి తరువాత గ్రామస్థాయి నుండి కొత్త కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు,నాయకులు నూతనోత్సాహంతో పనిచేసి
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాద్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కటకం గణేష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, పటేల్ భద్రయ్య, వాసుబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎంవిఆర్ఎస్ వర్మ, కొండేరు రాము, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !