భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12).
గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి.. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు.
అయితే కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది.
కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్నాళ్లుగా చందన కిస్తీలు కట్టలేకపోయింది.
దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురైన చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. ఇరుగుపొరుగువారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతిచెందింది.