నేటి గదర్ న్యూస్ జనవరి 07: ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాలరావు
మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్రుపాలెం మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు
మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్రుపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై నాయకులు కార్యకర్తలతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రం అధోగతి పాలలైదని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ఉట్టి మాటల గారడి తో కాలక్షేపం చేస్తుందని, ప్రజలు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం పాలన వ్యత్యాసం తెలుసుకొని మళ్లీ కెసిఆర్ నే రావాలని, కాంగ్రెస్ పార్టీ పాలన పై అతి తక్కువ కాలంలోనే విసిగి పోయారని, మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, రాష్ట్రం దేశంలోనే అగ్రగామీగా నిలవాలంటే కెసిఆర్ నే రావాలని ఒక పూర్తి విశ్వాసంతో,ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని నాయకులు కార్యకర్తలకు తెలియజేశారు, పార్టీకి ప్రజలే పట్టుకొమ్మలు, ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎర్రుపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రుపాలెం మాజీ జడ్పిటిసి శీలం కవిత, ఎర్రుపాలెం మాజీ మండల పార్టీ అధ్యక్షులు సేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, కుడుముల మల్లికార్జున్రెడ్డి,కత్తుల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి,సింహాద్రి తదితర బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.









