ములుగు జిల్లా.
మినీ మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి.
అన్ని పనులు నాణ్యతతో శశ్వతంగా నిలిచే విధంగా ఉండాలి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు.
జాతర విజయవంతనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి…
రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
****
ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని,
ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న పనుల అంచనా వివరాలను మంత్రికి సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ మేడం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజులుగా భక్తులు రాక పెరిగిపోయిందని, ఫిబ్రవరి మొదటి వారం నుండే భక్తుల తాకిడి అధికం కానున్న సందర్భంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారం జాతరకు వచ్చి అన్ని లింక్ రోడ్లను జనవరి 31 లోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అమ్మవార్ల ను భక్తులు దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్య లోపం జరగకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు. ఐదు రోజులపాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు వద్ద మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమే పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు.
జిల్లా అధికారులు సమర్పించిన అంచనాల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవసరం కానున్న నిధులను మంజూరు చేయిస్తానని, జాతర విషయంలో జిల్లా యంతరంగంతో పాటు ఐటిడిఏ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశం లో ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, ఇంజనీరింగ్ అధికారులు,
వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఎ అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.









