రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 7:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం నుండి మెదక్ నుండి ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట పట్టణం నుండి కాకుండా అవతలి వైపు నుండి బైపాస్ రోడ్డు నిర్మించడంతో అభివృద్ధి కుంటు పడుతుందని వ్యాపారాలు కొనసాగవంటూ వాణిజ్య వ్యాపారులు రామాయంపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సంపూర్ణంగా బంద్ నిర్వహించారు.అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయంలో రజినీకుమారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా రామాయంపేట అభివృద్ధిని పట్టించుకునే నాధుడే లేడని అన్నారు.మెదక్ పట్టణంలో మూడు చౌరస్తాలు దాటుతూ వస్తున్న మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి రామాయoపేట పట్టణం నుండి ఎందుకు వెళ్తుందని వారు ప్రశ్నించారు.ఏది ఏమైనా బైపాస్ నిర్మాణం వద్దంటూ తాము వ్యాపారాలు భూములు కోల్పోతామని లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ వాణిజ్య వ్యాపారస్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









