+91 95819 05907

ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ విజయవంతం చేయాలి.

★ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి P. సంజీవరెడ్డి.

ఈ నెల 31న ఇల్లందులో జరుగు టి యు సి ఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి పి. సంజీవరెడ్డి సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కోరారు. శనివారం మణుగూరు లోని వివిధ డిపార్ట్మెంట్ల సింగరేణి కాంట్రాక్టు కార్మికులను కలిసి కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్టు కార్మికులు ఒకే రకమైన పని చేస్తే ఆ పని శాశ్వత స్వభావం కలది అయితే వారి వేతనాలలో కూడా వ్యత్యాసం ఉండకూడదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సింగరేణి సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ సింగరేణిలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించడం లేదని ప్రభుత్వాలను విమర్శించారు. కోలిండియాలో హై పవర్ కమిటీ వేతనాలు అమలు జరుగుతున్నప్పటికీ, సింగరేణిలో అమలుపరచకపోవడం సరైనది కాదన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి jiయాజమాన్యాన్ని కోరారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, ఇతర చట్టబద్ధ హక్కుల, సౌకర్యాల అమలు కోసం రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని ఈ మహాసభలో కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వి. జానయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !