రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ చిత్తరమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలు భక్తులు,పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది.ఇందులో భాగంగా రామాయంపేట ఎక్సైజ్ సిఐ జయసుధ,ఆమె భర్త పడమటి సురేష్ బాబు బంగారు నక్లెస్ అందజేయడం జరిగింది.దీని విలువ సుమారు 35 వేల పైన ఉంటుందని తెలిపారు.అమ్మవారికి నగ సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయ పూజారికి నక్లెస్ అందించిన దంపతులను సగర సంఘం సభ్యులు వారిని అభినందించారు.
Post Views: 80