*ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల వియ్రాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు నోట్లు 38లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో,తొమ్మిది సెల్ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*
*పోలీసులు అరెస్టు చేసిన వారిలో: 1) మణికాల కృష్ణ,57 సంవత్సరాలు, గ్రామం మోరంపల్లి బంజర గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 2) ఎర్రగొల్ల శ్రీనివాస్ 36 సంవత్సరాలు,కేశవాపూర్ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా 3) బిజిని వేముల వెంకటయ్య,57 సంవత్సరాలు, కుర్వపేట, వేల్పనూరు గ్రామం, కర్నూలు జిల్లా,4) దరామ్సోత్ శ్రీను,45 సంవత్సరాలు,నక్రిపేట తండా బుర్గాంపాడ్ మండల్, భద్రాద్రి కొఠాగుడెం జిల్లా, 5) తేజావత్ శివ,34 సంవత్సరాలు, నక్రిపేట తండ బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 6) గుగ్లోత్ వీరన్న,26 సంవత్సరాలు, ముకమామిడి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం 7) ఉడుతా మల్లెష్, 26 సంవత్సరాలు, , ,కేశవాపూర్ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా.8) ఎర్రగొల్ల అజయ్, 25 సంవత్సరాలు, పెద్దపాపయ్యపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం ఇప్పుడు ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామం, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.*
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే అదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేసాడు. ఈ ప్లాన్లో భాగంగా నిందితుడు ప్రధానంగా గొర్రెల వ్యాపారం ద్వారా పరిచమయిన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దోరికిందని అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలు ఎదురౌవుతున్నాయని నమ్మించేవాడు. తనకు ఎవరైన ఒక లక్ష రూపాలు ఇస్తే వారికి అ డ్రమ్ములోని డబ్బు రెండిరతలు ఇస్తానని, అలాగే ఒక లక్ష ఇస్తే నాలుగు రెట్లు అధికంగా నకిలీ నొట్లను ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహలో నిందితుడు రెండవ నిందితుడైన హనుమకొండ జిల్లా కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్తో పరిచయం కావడంతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ వద్ద తాను అనుకున్న ప్లాన్ను అమలు చేసాడు. ప్లానులో భాగంగా పాల్వంచ అడవిలో ముందుగా అసలు, నకిలీ రూపాయల నోట్లతో భద్రపర్చిన డ్రమ్ము నుండి అసలు ఐదు వందల రూపాయాల నొట్ల కట్టను ప్రధాన నిందితుడు శ్రీనివాస్కు చూపించడంతో అవి అసలు నోట్లని నమ్మిన శ్రీనివాస్ పదిలక్షల అసలు నోట్లగాను ఇరువై లక్షల రూపాయలు అలాగే ఐదు లక్షల అసలు నోట్లకు ఇరువై లక్షల రూపాయల నకిలీ నోట్లు మార్పిడి చేసుకొనేందుకు నిందితుల ఇద్దరి మద్య అంగీకారం కుదిరింది. కాని తనకు డబ్బును హనుమకొండకు తీసుక వచ్చి అందజేస్తేనే నేను ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని నిందితుడైన శ్రీనివాస్ ప్రధాన నిందితుడుకి షరతు పెట్టడంతో ఇందుకు ప్రధాన నిందితుడు అంగీకరించినాడు. నిందితుల ఇద్దరు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రస్తుతం అరెస్టు చేసిన మరో నలుగురు నిందితులతో కారులో నిన్నటి రోజున కేయూసి అవుటర్ రింగ్రోడ్డుపై పెగడపల్లి క్రాడ్ రోడ్డ వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడే వున్న శ్రీనివాస్ మరో ఇద్దరు నిందితులతో కల్సి అసలు డబ్బుతో పాటు నకిలీ నోట్లను మార్పిడి చేసుకుంటున్న తరుణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు ఈ ముఠా సభ్యులందరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద వున్న బ్యాగులు, కారులో తనీఖీ చేయడంతో పెద్ద మొత్తంలో అసలు నగదుతో పాటు, నకిలీ నోట్లతో పాటు నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్లకాగితాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోని తీసుకోని విచారించగా నిందితులందరు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు ఇదే తరహలో మరో మిత్రుడి తో కల్సి తెల్ల కాగితాలపై ఐదు వందల రూపాయల నోటు ముద్రించి పలు మార్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో సత్తుపల్లి, వి.యం.బంజర,లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్ల్లో ప్రధాన నిందితుడిపై కేసులు నమోదు అయ్యాయి.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన ఏసిపి దేవేందర్ రెడ్డి, కేయూసి ఇన్స్స్పెక్టర్ రవి కుమార్, ఎస్.ఐ మాధవ్, హెడ్కానిస్టేబుల్ నర్సింగ్ రావు, కానిస్టేబుళ్ళు శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.