+91 95819 05907

నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా గద్దర్ జయంతి ఉత్సవాలు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంగా నూతన బస్టాండ్ ఆవరణలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ గారి 77వ జయంతి ఉత్సవాలను పార్టీలకతీతంగా ప్రజా సంఘాలు, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ విప్లవ జీవితంలో పీడిత ప్రజల కోసం అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసి పాటలు రాసి కవి,వాగ్గేయకారుడని అన్నారు.పీడిత ప్రజల తరపున అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసి,దొరల పాలన అంతం చేయడంలో తన కాళ్లకు గజ్జలు కట్టి ఆట-పాట ద్వారా ప్రశ్నించే గొంతుకై నిలిచి,ప్రజా పాలనను తీసుకురావడంలో తను వంతు కృషి చేసిన గొప్ప మహానీయుడని అన్నారు.ఆయనపై బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గద్దర్ కు అవార్డులు రివార్డులు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు అవసరం లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు. గద్దర్ కు ప్రజలే ఒక పెద్ద అవార్డులుగా ఆనాడే అయన కోరుకున్నాడని ప్రజలే ఆయన 40 సంవత్సరాల జీవిత చరిత్రలో పంచశీల రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంతో ప్రజలను ఏకం చేసిన గొప్ప మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్మాట బాబు, గరుగుల శ్రీనివాస్, మారుతి, నసీరుద్దీన్,రవీందర్,కొమ్మాట అమర్,బ్యాగరి రాజు,మోహన్ రెడ్డి,శ్యామల మహేష్,కొమ్మాట స్వామి,వల్లపు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !