+91 95819 05907

ఆధునిక సాంకేతిక డ్రోన్ తో రైతులకు అద్భుత లాభాలు రాజ్ నారాయణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 1:- వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకున్నప్పుడే రైతులకు అధిక ఆదాయం కలుగుతున్నదని వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ అన్నారు.మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం నందు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇఫ్ఫ్కో సంస్థ సుమారు 18 లక్షల విలువ చేసే డ్రోన్ మరియు ట్రాలీ ఆటోను ప్రాథమిక సహకార సంఘానికి ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.వ్యవసాయ శాఖ అధికారుల ప్రత్యేక చొరవతో ప్రాథమిక సహకార సంఘం సహకారంతో రామాయంపేట మండలం శివాయపల్లి గ్రామానికి చెందిన యువరైతు శ్రీకాంత్ కు ఇఫ్ఫ్కో సంస్థ ద్వారా డ్రోన్ పైలెట్ పై శిక్షణ ఇప్పించామన్నారు. అలాగే మండల పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లో పురుగుమందులు తెగులు మందులు ద్వారా పిచికారి చేయడానికి నియమించడం జరిగిందన్నారు.ర్రైతులు తెగులు మరియు పురుగుమందుల నివారణ కోసం పిచికారి చేసే సమయంలో పురుగు మందుల విష ప్రభావం వల్ల రైతుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అదేవిధంగా పురుగుమందుల మరియు తెగులు మందుల పిచికారి మోతాదుకు మించి వాడడం ద్వారా వాతావరణ కాలుష్యం మరియు నేల కాలుష్యం నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. పిచికారి కోసం ఒక మగ కూలి ఇద్దరు ఆడకూలీలు ప్రతిసారి అవసరం పడతాయి.ప్రస్తుతం కూలీల కొరత మరియు రైతు యొక్క శ్రమ సమయం దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అయినటువంటి డ్రోన్ ద్వారా పురుగుమందుల తెగులు మందుల పిచికారిని రైతులు అలవర్చుకోవాలని దీని ద్వారా తమ విలువైనటువంటి సమయం శ్రమ ఆదా అవుతుందని సూచించడం జరిగిందన్నారు.మెదక్ జిల్లాలోనే ప్రధమంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రామాయంపేట ద్వారా ఈ డ్రోన్ ద్వారా రైతులకు సేవలందించే అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం ఇఫ్కో సంస్థ మేనేజర్ చంద్రబాబు నాయుడు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సందీప్,సాయి కృష్ణ,సందీప్,ప్రవీణ్ సీఈవో నర్సింలు రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !