రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త పరీక్షల చేసే ల్యాబ్,ఇన్ పేషెంట్ వార్డ్,మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం పేద ప్రజలకు అందించాలని అన్నారు.రోగులకు మెరుగైన చికిత్స అందించాలని,వైద్యులు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేయాలని,ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.మందుల నిల్వలు స్టాక్ పెట్టుకోవాలన్నారు.ఆసుపత్రిలో రోగులకు రుచికరమైన బలమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు.అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.కలెక్టర్ వెంట వైద్యాధికారులు అస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.