రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల వ్యాప్తంగా భూ సమస్యలకు సంబంధించిన 1 దరఖాస్తు ప్రజల నుండి వచ్చిందని తెలిపారు.ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల కోసం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మండల పరిధిలోని ప్రజలు పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు నేరుగా మాకు సోమవారం అందజేయాలని,ఈ అవకాశాన్ని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Post Views: 85