+91 95819 05907

వ్యవసాయ కూలీలకు రోజు కూలీ. రూ. 300 చెల్లించాలి

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధికారులను కోరారు. రోజు ఇచ్చే కూలీలో కోత విధించవద్దని ఏడూళ్ల బయ్యారం, ఎల్సిరెడ్డిపల్లి తదితర గ్రామాల వ్యవసాయ కూలీలు నిర్వహిస్తున్న ఆందోళన కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం వ్యవసాయ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 300 రూపాయలు రైతులు చెల్లించే వారని, ఇప్పటి వరకు రైతులు, కూలీలు సమన్వయంతో పని చేసుకునేవారని అన్నారు. వేరే గ్రామాల నుండి మరియు వలస ఆదివాసీలను పోటీగా తీసుకొని వచ్చి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడంతో స్థానిక వ్యవసాయ కూలీలల్లో ఆందోళన మొదలైందని అన్నారు. రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేని వ్యవసాయ కూలీలు ఈరోజు ఉన్న నిత్యవసర సరుకుల ధరల దృష్ట్యా 250 రూపాయలతో ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో ప్రకారమే వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 385 రూపాయలు చెల్లించాలని చెబుతుంది. వారు చెల్లిస్తున్న 300 రూపాయలు కూడా తక్కువే అయినప్పటికీ రాజీపడి వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారని అన్నారు. అది కూడా తగ్గించి 250 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అనడం సరి అయింది కాదన్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోతే రైతులు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై పోరాడాలి. కానీ వ్యవసాయ కూలీల వేతనాల్లో కోత పెట్టడం సరైనది కాదన్నారు. రైతులు పునరాలోచన చేయాలన్నారు. వ్యవసాయ కూలీల న్యాయమైన సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. వ్యవసాయ కూలీలు కూడా ఆవేశం తో తొందర పడకుండా ఆలోచనతో, ఐక్యంగా నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !