+91 95819 05907

బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అయ్యవారు లక్ష్మణ్ ఎన్నిక

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8:- తెలంగాణ బీడి వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెండవ మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం సి ప్రభాకర్ భవన్ లో ఇటీవల జరిగాయి.ఈ మహాసభలలో మెదక్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అయ్యవారు లక్ష్మణ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జీడీ బాల లక్ష్మి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా కె పార్వతి, కొమ్మాట స్వామి ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి,రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్చార్జి విలాస్,నూతన రాష్ట్ర నాయకత్వానికి మెదక్ జిల్లా తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో అయ్యవారు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు నాణ్యమైన తునికాకు 26 గంటలు పని దినాలు బీడీ యాజమాన్యాలు కల్పించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కు రాజీనామా పెట్టిన కార్మికులకు 6 వేల రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలన్నారు.మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని విస్మరించిందన్నారు.రామాయంపేట పట్టణంలో గల బీడీ కార్మికుల దవాఖాన కార్మికులకు సరైన మందులు లేవని పర్మనెంట్ డాక్టర్లను నియమించాలని తెలిపారు.బీడీ కార్మిక దవాఖాన ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్నందున స్థలం కేటాయిస్తూ నూతన భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.ఉమ్మడి మెదక్-సిద్దిపేట పీఎఫ్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కి తరలించే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు.మెదక్ జిల్లాలో దాదాపు 25 వేల మంది బీడీ కార్మికులు పరిశ్రమలు పనిచేస్తున్నారన్నారు.దేశంలో వ్యవసాయ రంగం కంటే బీడీ పరిశ్రమ అగ్రగామిలో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన 4 వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !