+91 95819 05907

ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు :మాజీ మంత్రి హరీష్ రావు

🔷 ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు

🔹రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపిస్తున్నాయి

🔹ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు

🔹ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన్రు

🔹రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారు

🔹సోనియా గాంధీతో లెటర్లు రాయించారు. హామీలన్నీ ఏమయ్యాయి

🔹11 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి

🔹పోతున్నడు వస్తున్నడు కానీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ రేవంత్‌కు లేదు

🔹రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం

🔹బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవు

🔹కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తరో, ఎట్ల అరెస్టులు చేస్తరో తెలయని పరిస్థితి

🔹ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు

🔹ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు

🔹కేసులు పెట్టి బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు

🔹ఆర్ఎంపీలను రోడ్ల మీదకు తెచ్చారు

🔹రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం

🔹బీఆర్ఎస్ హయాంలో మీకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే, కొందరు స్టేలు తెచ్చారు

🔹నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, స్టేలు తెచ్చారు

🔹స్టేలు తెచ్చినా మేం మీ బతుకు దెరువు ఎక్కడా ఆపలేదు

🔹మీ మీద కేసులు పెట్టలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పలేదు

🔹కాంగ్రెస్ వాళ్లు వచ్చినంక అందరి బతుకులు రోడ్డున పడ్డయి

🔹గీత కార్మికుల పొట్ట కొడుతున్నరు. అక్రమ కేసులు పెడుతున్నరు

🔹రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు

🔹మొదటి హమీ మహాలక్ష్మి, చివరి హామీ పింఛన్లు దిక్కు లేదు

🔹రైతు రుణమాఫీ మీద ఏ ఊర్లకైనా పోదాం చర్చిద్దాం

🔹ఇవ్వాల్సింది రూ. 45 వేల కోట్లు, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెబుతున్నది 21, ఇచ్చింది 15, 16 వేల కోట్లు

🔹రుణమాఫీ ఓ మోసం.. ఆ 15,16 వేల కోట్లు ఎట్ల ఇచ్చిండంటే.. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి 8 వేల కోట్లు, రుణమాఫీకి ఇచ్చిండు

🔹రెండు నెలల పింఛన్ 2 వేల కోట్లు ఎగ్గొట్టి, రుణమాఫీకి ఇచ్చిండు

🔹కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ చీరెలు వెయ్యి కోట్లు ఎగ్గొట్టి, రుణమాఫీకి మలిపిండు

🔹కేసీఆర్ ఇచ్చే న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టిండు. అందులో రెండు వేల కోట్లు

🔹పిల్లల ఫీజు రియింబర్స్‌మెంట్ కూడా ఎగ్గొట్టిండు. 2500 కోట్లు రుణమాపీల కలిపిండు

🔹ఇట్ల కోతలు కోసిండు రుణమాఫీలో కలిపిండు

🔹ఇచ్చింది ఏముంది. చేసిన హామీలు ఏమయ్యాయి

🔹ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు

🔹15 నెలలు అయినా ఎవర్నీ కల్వలేదు

🔹కొడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి

🔹మీ సత్తా చూపే సమయం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

🔹కలసి ఉండాలి. విడిపోయి ఉండొద్దు. అప్పుడే మీకు బలం ఉంటది

🔹కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలి

🔹రేవంత్ రెడ్డి గాల్లో ఉన్నడు. గాలి మోటర్లు, విమానాల్లో తిరుగుతున్నడు

🔹ప్రజాస్వామ్యంలో ఓటే బలం. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి

🔹ఇప్పటికే అరెస్టు చేసిన వారి మీద వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం

🔹ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటది

🔹ఓట్లప్పుడు మాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నడు

🔹అడిగితే ఉల్టా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నడు

🔹వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తా

🔹పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప

🔹30% గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలే చెబుతున్నరు.. ఏ పని కావాలన్నా 30 శాతం కమీషన్

🔹పోలీసు వాళ్లకు జీతాలు రావడం లేదు, ఆరోగ్య భద్రత పని చేస్తలేదు

🔹పోలీసులు, ఆటో డ్రైవర్లు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నది

🔹ఉద్యోగస్థులకు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వడం లేదు

🔹మాటల గారడీ, అంకెల గారడీ అని అందరికి అర్థం అయ్యింది

🔹ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని చూస్తున్నరు

🔹రేవంత్ రెడ్డి ఢిల్లీకి పొయ్యి ప్రచారం చేసిండు. 80 స్థానాల్లో 77కి డిపాజిట్లు గల్లంతు

🔹ఇక్కడ పని చేసి వేరే రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేసుకో

🔹తెలంగాణలో ఏ ఊళ్లకు పోయినా నీ పాలన గురించి చెబుతారు రేవంత్ రెడ్డి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !