+91 95819 05907

మా పట్టా భూమిని ఆక్రమించేందుకు ఫారెస్ట్ వారి కుట్ర?

తగరం నాగయ్య కుటుంబ సభ్యుల ఆరోపణ!

కోర్టు ఆర్డర్లు సైతం ఉన్నా వేధింపులు తప్పడం లేదు!

మా పట్టా భూమికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 10: పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా డ్రైనేజీ నిర్మాణంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ను ఆర్ అండ్ బి శాఖ వారు కూల్చేసరికి, ఫారెస్ట్ వారు మా పట్టా భూములోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నారని ప్రభుత్వం తగు చర్య తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పేరాయిగూడెంకు చెందిన తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అశ్వారావుపేట పట్టణంలో రింగు రోడ్డుకు అనుకున్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో సుమారు 60 సంవత్సరాల క్రితం నుండి 1167 సర్వే నెంబర్లో 11 కుంటల భూమికి పట్టా హక్కులు కలిగి ఉండి అనుభవిస్తున్నామని, ఇట్టి భూమికి మార్చి 17 2004 న సత్తుపల్లి కోర్టులో ఐ ఎ నెంబర్ 310 /2003 ఓఎస్ నెంబర్ 53 /2003 తో జడ్జిమెంట్ పొంది ఉన్నామని, 2022 మార్చి 30న, 2024 అక్టోబర్ 29న కోర్టులు ఇచ్చిన ఆర్డర్లు సైతం ఉన్నాయని, ఈ భూమిలో తగరం నాగయ్య కుమారులు, కుమార్తెలైన తగరం వెంకటేశ్వరరావు, తగరం తిరుపతయ్య, తగరం ఏసురత్నం, బండి తిరుపతమ్మ, కాటూరి దుర్గమ్మ లు ఇట్టి భూమిని అనుభవిస్తున్నామని, ఫారెస్ట్ వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా రేంజర్లు మారినప్పుడల్లా మమ్ములను వేధింపులకు గురి చేస్తూ మీ హక్కు పత్రాలు చూపించండి అంటూ దౌర్జన్యం చేస్తూ మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనుల్లో గతంలో మా భూమిని ఆక్రమించుకొని నిర్మాణం చేసిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూల్చేసరికి, మరలా మరొకసారి మా పట్టా భూమిని ఆక్రమించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రయత్నాలు చేస్తున్నారని, మా పూర్వీకులు నిర్మాణం చేసిన పెంకుటిల్లును కూల్చేసి ఫారెస్ట్ వారు ఆక్రమించాలని చూస్తున్నారని అటువంటి చర్యలు మానుకోవాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మేము దళిత కుటుంబానికి చెందిన వారమని, ఏమి చేసినా చెల్లుతుందిలే అనే భావనతో మా పైకి ఫారెస్ట్ వారు దౌర్జన్యానికి వస్తున్నారని, మాకు ఉన్నదే కొంచెం భూమి అని, ఈ భూమిని కూడా మాకు దక్కకుండా చేయడానికి ఫారెస్ట్ వారు ప్రయత్నం చేస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టులో తేల్చుకోవాలి కానీ, మాపై దౌర్జన్యం చేయటం ఏమిటని, ఫారెస్ట్ వారికి ఆధారాలు ఉంటే, రెవెన్యూ వారికి పోలీసు వారికి చూపించాలని, లేనిచో మాపై వేధింపులు, మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలని, వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !