+91 95819 05907

తెలంగాణలో పెరిగిన బీర్లు రేట్లు…..బీర్ల ధరలపై 15 శాతం పెంచిన సర్కార్

★జస్టిస్‌ జైశ్వాల్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15 శాతం పెంచిన సర్కార్

*బీరు ప్రియులకు కాస్త చేదు వార్త…* రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెరిగాయి. *వచ్చేది ఎండాకాలం. చల్లగా రెండు బీర్లు తాగి సేద తీరదామనుకునే వారికి బీర్లు ప్రియం అయ్యాయి.* ధరల నిర్ణయ కమిటీ సిఫారసుల మేరకు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. పెరిగిన బీరు ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

*పెరిగిన బీరు ధరలు..* బీరు ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. జస్టిస్‌ జైశ్వాల్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా *బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.* పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్‌ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి.

*బీరు విక్రయాల్లో 69 శాతం కింగ్‌ఫిషర్‌ వాటా…* బీరు విక్రయాల్లో 69 శాతం కింగ్‌ఫిషర్‌ వాటా ఉంది. సంక్రాంతికి ముందు తమకు ధర గిట్టుబాటు కావడం లేదంటూ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ బీరు సరఫరా ఆపేసింది. ముందస్తు సమాచారం లేకుండా బీర్ల సరఫరా నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ధరల నిర్ణాయకకమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సర్కార్‌ తెలిపింది. ఆ తర్వాత యూబీఎల్ కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి సరఫరా పునరుద్ధరించారు. ఆ ఒప్పందం మేరకే తాజాగా బీరు ధరలు పెంచుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

 Don't Miss this News !