◆ ఖమ్మం జిల్లా దామన్న సైన్యం
ఖమ్మం పట్టణంలో దామన్న సైన్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదించి మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ప్రకటించిన తెలంగాణ లో మాదిగ అమరవీరుల వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు శనివారం నివాళులర్పించారు . నివాళులర్పించిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి , గరికపాడు సొసైటీ డైరెక్టర్ మెరుగు రత్నరాజు , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ పిలుపుమేరకు వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి నివాళులర్పించారు . అలాగే అమరులైన కుటుంబాలకు మంత్రి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు సొంత ఖర్చులు ఇవ్వడం జరిగింది . అనంతరం దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు చట్టం తీసుకుని రావాలని మాదిగలంతా కాంగ్రెస్ వైపు అండగా ఉండాలని వారన్నారు . ఈ కార్యక్రమంలో ప్రకాష్ రావు , బంక రవికుమార్ , ఇలారపు రత్నబాబు , ఇసుకల సురేష్ , కొమెర నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు .









