నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి :
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ వాజేడు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా వావిలాల స్వామి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు హాజరై మాట్లాడుతూ అమరులైన అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వమని ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో పోరాటానికి అమరుల సాక్షిగా సిద్ధపడాల్సిందిగా కోరారు మీ ఆశయ సాధనలో సాధించి తీరుతామని వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో చెన్నం ఎల్లయ్య మాదిగ సినియర్
నాయకులు
బలుసుపాటి రాజు మాదిగ
సినియర్ నాయకులు
అరిక్కిళ్ల వేణుమాదిగ
మండల సినియర్ నాయకులు
కర్నె ఓంకార్ మాదిగ ఎమ్మార్పీఎస్
మండల సినియర్ నాయకులు
చెన్నం ఆదినారాయణమాదిగ
మరియు తదితరులు పాల్గొన్నారు









