లారీలను అదుపులోకి తీసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
మూడు లారీల బాయిల్డ్ రైస్ సీజ్
నేటి గద్దర్, న్యూస్, అశ్వారావుపేట, మార్చ్ 1: కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లుల నుండి బాయిల్డ్ రైస్ ఏపీ లోని కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 12 లారీలను శనివారం తెల్లవారుజామున అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ వరదరాజులు, డిటి ప్రభాకర్ టీం లారీలను అదుపులోకి తీసుకున్నారు. 9 లారీలకు క్లియరెన్స్ పేపర్స్ ఉండగా వాటిని విడిచిపెట్టారు. మరో మూడు లారీలకు సరైన పేపర్స్ లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు ఏ సి ఓ వరదరాజులు తెలిపారు. ఒక్కో లారీలో 200 క్వింటాల బాయిల్డ్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకే తాము ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేనటువంటి మూడు లారీల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.









